హైదరాబాద్ : ఈ నెల 15న ఏపీ క్యాబినేట్ సమావేశం కానుంది. 15న ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్ లో మంత్రి వర్గం సమావేశం కానున్నట్టు చెబుతున్నారు. పలు అంశాలపై చర్చించి మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను సిద్దం చేయాలని విభాగాధిపతులకు సీఎస్ నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13 సాయంత్రం 5 గంటల్లోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇక గత నెల 11న జరిగిన కేబినెట్ భేటీలో జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీములకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, మూడు రాజధానులతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారని అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm