హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో జిల్లా కేంద్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.
తాజాగా సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 157 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 67 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు చెప్పారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వల్ల ముగ్గురు మృతి చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 10,2020 07:24PM