హైదరాబాద్ : ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ రమేశ్కుమార్ బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈఎస్ఐలో మెడిసిన్ కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితో పాటు రమేశ్కుమార్ను అరెస్టు చేశారు. కాగా..విజయవాడ యాంటి కరెప్షన్ బ్యూరో స్పెషల్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఎస్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. పితాని తనయుడి కోసం గాలింపు సాగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm