న్యూఢిల్లీ : ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కు చెందిన జూనియర్ రెసిడెంట్ డాక్టర్ (25) హాస్టల్ భవనం 10వ అంతస్తు పైనుంచి దూకినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్కు తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 5న ఎయిమ్స్ నాలుగో అంతస్తులోని జయప్రకాశ్ నారాయణ అపెక్స్ ట్రామా కేంద్రం నుంచి ఓ జర్నలిస్టు దూకి తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. 35 ఏండ్ల జర్నలిస్టు జూన్ 24న కరోనాతో జయప్రకాశ్ నారాయణ అపెక్స్ ట్రామా కేంద్రం (జేపీఎన్ఏటీసీ)లో చేరారని ఎయిమ్స్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. జర్నలిస్టు మృతికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సంతాపం తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm