న్యూఢిల్లీ : కేంద్రం నిర్ణయంతో ఈ-కామర్స్ సంస్థలకు షాక్ తగిలింది. ఆయా సంస్థలు విక్రయిస్తోన్న ఉత్పత్తులు... ఎక్కడ తయారయ్యాయనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సిందేననని స్పష్టం చేసింది. ఇందుకుగాను... ఈ నెల చివరి వరకు గడువిచ్చింది. ఈ సమాచారాన్ని తెలియజేయనిపక్షంలో... భారీ జరిమానాతోపాటు జైలుశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో... కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కామర్స్ కంపెనీలకు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొడక్ట్ ఎక్కడ తయారైందనే అంశాన్ని ఖచ్చితంగా వెబ్సైట్లో తెలియజేయాలని పేర్కొంది. ఒకవేళ అలా చేయకపోతే రూ. లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనికి ఈ నెల చివరి వరకు గడువిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm