హైదరాబాద్ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి మెదక్ ఎంపీ పై ఫైర్ అయ్యారు. సంగారెడ్డి వర్తక వ్యాపార సంగం ప్రెసిడెంట్ సూరి గుండెపోటుతో, శ్వాస బాధతో ఈరోజు ఉదయం మృతి చెందారని అన్నారు. అయితే సూరి గుండెపోటుతో చనిపోయాడా.. కారోనాతో చనిపోయాడా తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే అనుమానంతో జాయిన్ చేసుకోలేదు..గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్లేలోపే చనిపోయారని తెలిపారు. చనిపోయాక కారోనా తో చనిపోయారా లేదా అనే టెస్ట్ చేసే పరిస్థితి లేదని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ ఇండెంట్ చెప్పారని అన్నారు. సంగారెడ్డి జిల్లా టౌన్ హాస్పిటల్ లో ఎలాంటి ఫెసిలిటీలు లేవని అన్నారు. మెదక్ ఎంపీ కనిపించకుండా పోయాడని మండిపడ్డారు. సూరి మరణంతో తాను రేపు చేయాలనుకున్న దీక్షను వాయిదా వేస్తున్నట్టు జగ్గారెడ్డి ప్రకటించారు. రెండు,మూడు రోజుల్లో దీక్ష ఎప్పుడు చేసేది వెల్లడిస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm