హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారు. మనకు తెలియకుండానే మన అకౌంట్ను నుంచి డబ్బును మాయం చేస్తున్నారు. తాజగా ఆన్లైన్లో వస్తువుల పేరుతో దాదాపు రూ.10 లక్షలు కాజేశారు. హైదరాబాద్ బేగంపేటకి చెందిన మహమ్మద్ యాసిన్ అహ్మద్ ఆన్లైన్లో కన్స్ట్రక్షన్ గ్లౌస్లను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన అనంతరం తనకు తెలియకుండానే తన అకౌంట్ నుంచి రూ.6.88 లక్షలు మాయమయ్యాయి. దీంతో అనుమానం వచ్చిన అహ్మద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు తనను తెలియకుండానే తన అకౌంట్ నుంచి రూ.3.88 లక్షలు కాజేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని లకిడికపూల్కి చెందిన రజిని అనే మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm