చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం కొద్దిగా కేసులు తగ్గినప్పటికీ ఈ రోజు మళ్లీ పెరిగిపోయాయి. దాదాపు 4వేల వరకు కొత్త కేసులు బయపడ్డాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా34వేలు దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69 మంది మరణించారు. 3,591 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,34,226కి చేరింది. వీరిలో 46,410మంది చికిత్స పొందుతుండగా 85,915మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 1,898మంది మృత్యువాతపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm