ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితులకు సూచించే ప్రధాన ఔషధాల కొరత, బ్లాక్ మార్కెటింగ్ ఫిర్యాదుల నేపధ్యంలో ఈ ఔషధాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. బాధితుల సంబంధీకులు ఆధార్ కార్డు, కోవిడ్ -19 టెస్ట్ సర్టిఫికెట్, ప్రిస్క్రిప్షన్ చూపించడంతోపాటు ఫోన్ నంబర్ ఇస్తేనే ఈ ఔషధాలు ఇస్తారని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 2.38 లక్షలకు చేరుకుంది.ఈ సందర్భంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేంద్ర షింగనె మాట్లాడుతూ రాష్ట్రంలో సరఫరాకు తగినంతగా మందులు ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు ఈ ఔషధాలకు మరింత డిమాండ్ పెరిగిందన్నారు. దీనికితోడు ఈ మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీంతో ఇకపై ప్రిస్క్రిప్షన్, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఉన్న కోవిడ్-19 పాజిటివ్ బాధితులకు మాత్రమే మందులు అందజేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm