ముంబై : కరోనా నిర్ధారణతో ఆస్పత్రిలో చేరిన బిగ్బీ అమితా బచ్చన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నానావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నాయని, ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ వార్డులో ఉన్నారని తెలిపారు. ఆయనతో పాటు అభిషేక్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారికి సంబంధించిన ఫలితాలు నేడు రానున్నాయని సమాచారం. అయితే తనుకు కరోనా నిర్ధారణ అయినట్లు ట్విటర్ ద్వారా అమితాబే స్వయంగా తెలిపిన విషయం విధితమే.
Mon Jan 19, 2015 06:51 pm