హైదరాబాద్ : దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు కురుస్తూ సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇదే సమయంలో నిత్యం ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే యార్డులోని ఓ షెడ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే అక్కడి సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm