హైదరాబాద్ : చైనాలో ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి కొన్ని ప్రాంతాల్లో విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా పగబట్టింది. ఆదివార నాడు హెబీ ప్రావిన్స్లోని గుయే జిల్లా తంగ్షన్ నగరంలో భూకంపం సంభవించింది. ఇది నార్త్ చైనా ప్రాంతంలో ఉంటుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1 మాగ్నిట్యూడ్గా నమోదైంది. బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.38 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని చైనీస్ క్సిన్హువా న్యూస్ సిటింగ్ చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ తెలిపింది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఎలాంటి నష్టం వాటిల్లనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm