కరీంనగర్: నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. క్లాక్ టవర్ దగ్గర ఉన్న వ్యాపార సముదాయాల్లో మూడో రోజు క్లీనింగ్ ప్రక్రియ చేపట్టారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రతిరోజూ స్ప్రే చేస్తున్నామని మేయర్ సునీల్ రావు తెలిపారు. నగరంలో వ్యాపారులు స్వచ్చందగా మూడు రోజులపాటు షాపులను మూసివేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మార్చిలో మొట్టమొదట కరీంనగర్లో కరోనా పాజిటీవ్ వచ్చిన తర్వాత వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్నామన్నారు. దీనికి ప్రజలు కూడా పూర్తి సహకారం అందించారని చెప్పారు. లాక్ డౌన్ ఉండడంవల్ల చాలావరకు కరోనా కంట్రోల్ చేయడం జరిగిందన్నారు. వ్యాపారులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు స్వచ్చంధంగా షాపులు మూసివేశారని, దీంతో మొత్తం శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు. నగరంలో అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉందని, ఎక్కడ ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తున్నారని సునీల్ రావు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm