నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 17వ తేదీన నిరసన వ్యక్తం చేస్తున్నట్లు దక్షిణ రైల్వే డీఆర్ఈయూ సహాయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు వెల్లడించారు. మంగళవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 109 మార్గాలలో 224 ప్యాసింజర్ రైళ్లు ప్రవేశపెడుతున్నారని, ఫలితంగా 13 లక్షల మంది సిబ్బంది 6.5 లక్షలకు కుదింపబడతారని అన్నారు. ప్రస్తుతం ఉన్న 10 రైల్వేశాఖలను నాలుగుకు కుదించేస్తున్నారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm