Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బుధవారం తహశీల్దారు కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాచర్ల సారయ్య, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి గుగులోతు నానునాయక్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, నష్టపోయిన పంటలను అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. వరి, పత్తి, వాణిజ్య పంటలు వర్షాలకు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన నష్టాన్ని గుర్తించి రైతులను ఆదుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల రైతులను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నియోజకవర్గ కార్యదర్శి మాన్యపు బుజేందర్, అఖిల భారత కిసాన్ మహా సభ(ఏఐకెఎం) జిల్లా కన్వీనర్ జీడి సోమయ్య, ఎంసీపీఐ(యు) నాయకులు బత్తిని కుమారస్వామి, రైతులు పాల్గొన్నారు.