Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ, ఉత్సవాలకు పాలక వర్గ సభ్యుల పనులు
- పనుల సమాచారం తెలియదన్న అధికారులు
నవతెలంగాణ-పరకాల
పరకాల మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాలైన రాజిపేట, సీతారాంపురం తోపాటు పట్టణ ప్రజలు బతుకమ్మ, దసరా ఉత్సవాలు నిర్వహించడానికి పట్టణంలోని దామలచెరువు, పశువుల సంత మైదానంలో మరమ్మతులకు గాను రూ. ఆరు లక్షల నిధులను కేటాయించింది. ఈ పనులు చేయించేందుకు కాంట్రాక్టర్లతో బాక్స్ టెండర్ ద్వారా పనులు చేయక ముందే పాలకవర్గ సభ్యులు ముందస్తుగా దామల చెరు వు కట్ట సమీపంలో నిలిచిపోయిన నీరు, చెత్తా చెదారాన్ని జేసీబీతో మరమ్మతు పనులు చేయించడంతో పాటు పశువుల సంత మైదానంలో లైటింగ్ ఏర్పాట్లకు పోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక కాంట్రాక్టర్ తో ఒప్పందం ఏర్పరచుకుని ముందస్తుగా అధికారులకు సమాచారం లేకుండానే పనులు చేయించడం ఏంటని పలువురు వాపోతున్నారు. టెండర్ లేకుండా అధికారులకు సమాచారం ఇవ్వకుండా పనులు నిర్వహించడం వల్ల పనుల్లో ఆలసత్వం ఉంటుందని ఉత్సవాలను ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. ఇదే విషయమై స్థానిక మున్సి పల్ ఏవో అధికారి వంశీని వివరణ కోరగా ఆరు లక్షల నిధులతో పనులను చేయించడం జరుగుతుందని అని అందులో ఒక లక్ష రూపాయలతో లైటింగ్ ఏర్పాట్లకు దామలచెరువు, రాజంపేట విలీనమైన గ్రామాలకు, పశువుల సంత మైదానంలో లైటింగ్కు కేటాయించి ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ ఫోన్లో అడగగా దసరా బతు కమ్మ ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పాలకవర్గం చేసే పనులకు నిధులు ఏర్పాటు చేసుకునే విషయాలు మాకు తెలియదని నాకు మీటింగ్ ఉంది హనుమకొండకు వెళ్తున్నాం అంటూ దాటేసే థోరణితో సమాదానం ఇచ్చాడు. అధికారులకు, పాలకవర్గానికి సమన్వయం లేకపోవడం పలు సంఘటనలు సైతం మిన్నంటి కుంటున్న వాద నలు లేకపోలేదు. ఏది ఏమైనా ఉత్సవాలు సాఫీగా జరిగేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.