Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డు లోని కంటలను బుధవారం మార్కెట్ కమిటీ చైర్మెన్ చింతం సదానందం పరిశీలించారు. రైతులకు మద్దతు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. యార్డు సందర్శనలో భాగంగా దామెర మండలం ల్యాదల్ల గ్రామానికి చెందిన దాసు అనే రైతు తీవ్ర జ్వరంతో బాధ పడుతుండగా గుర్తించిన చైర్మెన్ వెంటనే వైద్యుడిని పిలిపించి అతనికి చికిత్స చేయించారు. అతని యొక్క పత్తిని ఖరీదు చేయించి ఇంటికి వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్ గోపాల్ రెడ్డి డైరెక్టర్ వెంకట్ రావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి రాహుల్ గ్రేడ్ 2 కార్యదర్శులు కుమారస్వామి, చందర్ రావు పాల్గొన్నారు.