Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాండిచ్చేరి యూనివర్సిటీలో ఆలిండియా 124 ర్యాంక్ సాధించిన చైతన్య
- దాతల చేయూత కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ-శాయంపేట
నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన విద్యార్థినికి తండ్రి ఉన్నత చదువులు చదివించగా, పాండిచ్చేరి యూనివర్సిటీ లో ఎంఎస్సీ మెరైన్ ఆల్ ఇండియా లెవెల్ లో 124 వ ర్యాంక్ సాధించినప్పటికీ, ఆర్థిక స్థోమత లేక దాతల చేయూత కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. మండలం కేంద్రానికి చెందిన గుంటి రాజనర్సు శ్రీమతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రాజనర్సు పోస్ట్మాన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషి స్తున్నాడు. రెండవ అమ్మాయి చైతన్య పదో తరగతి వరకు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియట్ శ్రీ హర్ష కాలేజీలో, బీఎస్సీ ఫిషరీస్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంది. పాండిచ్చేరి యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయగా మంగళవారం వెలువడిన ఫలితాలలో ఆలిండియా స్థాయిలో 82 మార్కులు పొంది 124వ ర్యాంకు, ఎస్సీ కేటగిరిలో ఎనిమిదో ర్యాంకు సాధించింది. కేరళ వెళ్ళడానికి, యూనివర్సిటీ ఫీజు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో దాతల చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపార వేత్తలు స్పందించి ఆర్థిక సహాయం అందించి, ఉన్నత చదువులు చదువుకోవడానికి సహకరించాలని చైతన్య మిత్రులు కోరుతున్నారు.