Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురికి గాయాలు, పలు బైకులు ధ్వంసం
నవతెలంగాణ-గోవిందరావుపేట
అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ఓ దుకాణ సముదాయంపైకి దూసుకెళ్లిన ఘటన గోవిందరావుపేట మండల పరిధి పస్రా గ్రామంలోని హన్మకొండ-ఏటూరునాగారం 163 జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. వాహనం కింద 5 బైకులు ధ్వంసమయ్యాయి. గాయాలపాలైన వారిని స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ మేడారం రహదారిని నుండి మొద్దులగూడెం రహదారికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. వాహనం వేగంతో పాటు డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. కాగా పస్రా ఎస్సై రవీందర్ ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.