Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శిమోకు కనకారెడ్డి
నవతెలంగాణ-రఘునాథపల్లి
రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూములను కొంతమంది రియల్టర్లు అక్రమించేందుకు యత్నిస్తున్నారని, భూములను ప్రభుత్వం కాపాడాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆయన పరిశీలించి మాట్లాడారు. మేకలగట్టు గ్రామంలో 206 సర్వే నెంబర్లో అసైన్డ్ భూములను 39 దళిత కుటుంబాలకు, ఇతరులకు కేటాయించారన్నారు. 1977 చట్టం ప్రకారం భూము లను కొనుగోలు, ఇతరులకు బదిలీ చేసే అవకాశం లేదన్నారు. కొంతమంది రియల్టర్లు ఈ భూములను కోనుగోలు చేశామని దళిత , గిరిజనులపై ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితులతో కలసి తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఉడుత రవి, బొట్ల శ్రీనివాస్, ఎదునూరి వెంకట్రాజం, జిల్లా కమిటీ సభ్యులు రాపర్తి రాజు, పొత్కనూరి ఉపేందర్, పొదల నాగరాజు పాల్గొన్నారు.