Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పగుళ్లు బారిన పడ్డ కొప్పుల వసంతపూర్ గ్రామాల మధ్య నిర్మించిన లో లెవల్ వంతెన
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని కొప్పుల వసంత పూర్ గ్రామాల మధ్య నిర్మించిన లో లెవల్ వంతెన మధ్య భాగంలో పగుళ్లు బారిన పడడంతో వాహన దారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెన సమీప ంలోని కొప్పుల చెరువు నుంచి నీరు ప్రతినిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో చెరువు నీటి ఉధతి పెరగడంతో లో లెవెల్ వంతెన గుండా నీటి ఉధతి పెరిగి రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. నీటి ఉధతి ఎక్కువగా ఉన్నప్పుడు వంతెన మధ్యలో పగుళ్ళు గమనించగా వాహనదారులు అతి వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. ఈ విషయమై కొప్పుల గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యురాలు వంగాల శిరీష గ్రామ సభ దష్టికి తీసుకెళ్లగా ఇప్పటివరకు మరమ్మతు చేసిన పాపాన పోలేదు. బీజేపీ బూత్ అధ్యక్షులు వంగాల భాస్కర్ రెడ్డి దేవాదుల కాంట్రాక్టర్ దష్టికి తీసుకెళ్లడంతో ఇటీవల వంతెన మధ్యభాగంలో ఒక పక్క సిమెంట్ తో గుంతలను పూడ్చి వేసి చదును చేశారు. ఆయినప్పటికీ మరోపక్క పగుళ్ళ భారిన ఉండ డంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్ప టికైనా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి స్పందించి లోలెవెల్ వంతెన స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మించి ప్రజల కష్టాలు తొలగించాలని కోరుతున్నారు.