Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
అప్పుల బాధ భరించలేక మనస్థాపానికి గురై కారోబార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రామన్నగూడెం తండాలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు ,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాదావత్ చందూలాల్ (33) వత్తిరీత్యా కారోబార్ పని చేసుకుంటూ తనకున్న ఒక ఎకరం భూమితో పాటు మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయం కొరకు నాలుగు లక్షల అప్పు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తుండటంతో దిగుబడి తక్కువగా వచ్చింది. తీసుకొచ్చిన అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురైన చందూలాల్ తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం పరకాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్య సలహా మేరకు వరంగల్లోని ఎంజీఎంకు తరలించి చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించి మతి చెందారు. మతునికి భార్య శారద, ఇద్దరు కుమారులున్నారు. భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు రేగొండ ఎస్ఐ గుర్రం కష్ణ ప్రసాద్ గౌడ్ తెలిపారు.