Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-భూపాలపల్లి
భూ రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలతతో కలిసి సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విఆర్ఎలతో సమావేశం నిర్వహించి రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ పై చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి భూవివాదాలు తలెత్తవని అందుకే జిల్లాలో గ్రామాలు, మండలాల వారీగా ఆర్డిఓ, జెసి మరియు హైకోర్టులో పెండింగ్లో ఉన్న భూవివాదాల కేసులు గ్రామాలు, సర్వేనెంబర్, విస్తీర్ణం వారీగా సంపూర్ణంగా సేకరించి కంప్యూటరీకరణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, కలెక్టర్ కార్యాలయం, ఆర్డిఓ కార్యాలయాల సంబంధిత సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.