Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
లైన్ ఉమెన్గా అన్ని అర్హతలున్నప్పటికీ సంబంధితశాఖ అధికారులు తనకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని మండల పరిధి బొజ్జతండాకు చెందిన వాంకుడోత్ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు హైదరాబాదు లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి హై కోర్ట్ ఉత్తర్వులతో పోల్ టెస్ట్ నిర్వహించగా అర్హత సాధించినట్టు తెలిపారు. అయినా నియామకపు ఉత్తర్వులు ఇవ్వట్లేదన్నారు. స్పం దించిన మంత్రి త్వరలో నియామకపు ఉత్తర్వు లు అందేలా కృషి చేస్తానని హామీనిచ్చినట్టు తెలిపారు. దేశంలోనే ప్రథమ లైన్ ఉమెన్గా తన నియోజకవర్గానికి చెందిన మహిళ కావడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, రైతు బంధు కో ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, తొర్రూర్ కోర్ట్ అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ ప్రవీణ్ రాజు, బోజ్యా తండ సర్పంచ్ కాలు నాయక్, ఉప సర్పంచ్ యాకయ్య పాల్గొన్నారు.