Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజెన్సీ వాసులకు ఉత్తమ వైద్య సేవలందించాలి
- డీఎంహెచ్ఓపై జెడ్పీ చైర్మెన్ జగదీశ్వర్ ఆగ్రహం
నవతెలంగాణ-ములుగు
నిబద్ధతారహిత ఉద్యోగులను వెనుకేసుకు రావొద్దని ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్ అధికారులపై మండిపడ్డారు. ములుగు మండలంలోని సర్వాపూర్, పంచో త్కులపల్లి, రాయినిగూడెం గ్రామ పంచాయ తీల పరిధి వివిధ అభివృద్ది పనులకు బుధవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాయినిగూడెం పీహెచ్సీని సందర్శించి తనిఖీ చేశారు. మొదట ఆస్పత్రి సిబ్బంది వివరాలు తెలుసుకుని హాజరు పట్టికను పరిశీలించారు. ఇందులో హాజరైనట్లు స్థానిక మెడికల్ అధికారి జ్యోష్ణా దేవి, సీని యర్ అసిస్టెంట్ వసీం ముస్తాఫా అహ్మద్ సంతకం ఉండటంతో వారి ఏరంటూ ప్రశ్నించారు. దీంతో ఉద్యోగులు నీళ్లు నిమి లారు. వెంటనే డిప్యూటీ డీఎంహెచ్ఓ రవిందర్కు ఫోన్ చేసి వివరణ కోరగా మెడికల్ అధికారిమి సెలవుపై వెళ్లిందని సమాధానం ఇచ్చారు. అనంతరం డీఎంహెచ్ఓ అల్లం అప్పయ్యను వివరణ కోరగా సదరు అధికారులు ఇరువురు డ్యూటీలో ఉన్నారంటూ సమాధానం ఇచ్చారు. వెంటనే జెడ్పీ చైర్మెన్ స్పందిస్తూ తాను ప్రస్తుతం పీహెచ్ సీలో ఉన్నానని తెలుపడంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ పొంతన లేని సమాధానాలు డీఎంహెచ్ఓ తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన జెడ్పీ చైర్మెన్ నిబద్దత లేని అధికారులను వెనుకెసూకరావడం జిల్లా స్థాయి అధికారిగా సబబు కాదని హితవు పలికారు. ములుగు జిల్లా వెనుకబడి జిల్లా అని రాయినిగూడెం ప్రాంతం ఆదివాసీ ప్రాంతమని ఇక్కడ వైద్య సేవలు తప్పనిసరిగా అందాల్సిందేనని అన్నారు. ఈ రాయినిగూడెం పీహెచ్సీపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ సేవలు అందేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, స్థానిక సర్పంచ్ పారిజాతం , స్థానిక ఎంపిటిసి మాసిపెద్ది పుష్పలత సత్యం, గోవింద్ నాయక్ ఉన్నారు.
రైతు ఆత్మ గౌరవ ప్రతీకలే రైతు వేదికలు
ములుగు మండలంలోని కొత్తూరు, పంచోత్కులపల్లి, రాయినిగూడం గ్రామాల్లో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ బుధవారం పర్య టించారు. కొత్తూరు గ్రామ పంచోత్కులపల్లి గ్రామంలో సుమారు రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాయినిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తూరు క్లస్టర్ పరిధిలోని రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు. రైతు ఆత్మ గౌరవానికి ప్రతీక కగా ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు వేదికలు చేప ట్టినట్టు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడు జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతో రుగుతోందన్నారు. అనంతరం నిరుపేదలైన ఏజెన్సీ వాసులు తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చారు. నియోజక వర్గానికి రాబోయే డబుల్ బెడ్ రూం ఇళ్ళలో ప్రాధాన్యతనిస్తానని అన్నారు. కొత్తూరు సర్పంచ్ సోమ పారిజాతం వెంకటస్వామి, పంచోత్కులపల్లి సర్పంచ్ మాలోతు రవిందర్ , ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మెనర్ ఆలయం రామ్మూర్తి, ఎంపీటీసీ పుష్పలత సత్యం, గ్రామ కార్యదర్శి సానికొమ్ము విద్యాధర్ రెడ్డి, వార్డు సభ్యులు చీమా రమ రాజు, అక్కల సంపత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా...
ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా కార్య కర్తలు పనిచేయాలని జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో నియోజక వర్గ టీిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. మండలాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీిల సభ్యులతో మాట్లాడి మనోగతాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎమ్మల్సీ ఎన్నికలలో అభ్యర్థి గెలుపు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. మొన్న జరిగిన రాష్ట్ర పార్టీ కార్యాల యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు ఖరారు అయినట్లేనని తెలిపారు. పల్లా గెలుపునకు అందరూ పనిచేయాలని అన్నారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్న ఇతర పార్టీల వారు ఉనికి చాటుకోవడం కోసం బరిలో ఉంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి తెలుసుకోకుండా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చేసే దిగదురుపు రాజకీయాలను తిప్పికొట్టే లా టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్దంగా ఉండాలని అన్నారు. బీజేపీ అంటే బ్రమ మాత్రమేనని, ఏనాడు రాష్ట్రానికి చేసింది ఏమి లేదని అన్నారు. మండలాల అధ్యక్షులు ప్రవీణ్, రామాచారి, బిక్షపతి, సునిల్ కుమార్, లక్ష్మీనారాయణ, చంద్రయ్య, సమ్మయ్య, వేణు, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, కోఆప్షన్ సభ్యురాలు వలీయాబి, పీఏసీఎస్ చైర్మన్లు రమేష్, చిక్కుల రాములు, రైతు బందు సమితి జిల్లా అధ్యక్షుడు బుచ్చయ్య, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ రామ్మూర్తి, ఓడీసీఎంఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.