Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లబ్యాడ్జీలు ధరించి టీఎస్ యూటీఎఫ్ నిరసన
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న బోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన చేపట్టారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆడికే సతీష్ కుమార్ మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి శ్రమకు తగ్గ వేతనాన్ని అందించాలన్నారు. హెల్త్కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉపాధ్యాయులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, పీఆర్సీ అనుగుణంగా వేతనాలు చెల్లించి, వేసవి సెలవుల్లో కూడా వేతనాలు చెల్లించాలన్నారు. 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. టీఎస్ యూటిఎఫ్ మండల అధ్యక్షులు యాతం రమేష్, ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి ఫకీర్ దాస్, జెవివి,యూటీఎఫ్ బాధ్యులు శ్రీనాథ్, కేజిబివి ఇంఛార్జి శ్రీదేవి, శ్వేత, ప్రసూన, శ్రీలత, కవిత,సీఆర్టీ లు సంతోషిణి, స్వప్న, మానస, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
బయ్యారం : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి లింగా నాయక్ కోరారు. ఆ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం బయ్యారం కేజీబీవీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్స్ సాధించే వరకు దశల వారి పోరాటాలు నిర్వహి స్తామని అన్నారు. పాఠశాల సిబ్బంది సీనియర్ నాయకులు ఆర్వి ప్రసాద్ పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : కేసముద్రంలోని కేజీబీవీ పాఠశాల లో టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి రాందాస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎస్ఓ పోస్టులను జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్థాయికి అప్గ్రేడ్ చేయాలని, పీఈటీలను పీడీలుగా, సీఆర్టీలతో సమానంగా వేతనం చెల్లించాలన్నారు. కేజీబీవీ, యుఆర్ఎస్ పాఠశాలల్లో హాస్టల్ కేర్ టేకర్స్ను నియమించాలని డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ మండల బాధ్యులు హుస్సేన్, నీలిమ స్పెషల్ ఆఫీసర్, సీఆర్టీలు దుర్గా లక్ష్మి ,అర్చన, సుష్మా, రహీమున్నీసా, రాధిక, పావని, ఉపేంద్ర పాల్గొన్నారు.
నర్మెట : కస్తూరిభా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వారకు పోరాటం చేస్తామని టీిఎస్ యూటీఎఫ్ నర్మెట మండల కార్యదర్శి వి నర్సింహులు హెచ్చరించారు. వేతనాలు పెంచడం, ఉద్యోగుల్ని క్రమబద్దీకరించడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న కస్తూరిబా ఉద్యోగులకు మాత్రం వేతనాలు పెంచడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలోనూ పలు డిమాండ్లకు అంగీకరించిన ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించడం లేదన్నారు. సీఆర్టిలు రజిని, హేమలత, స్వరూప, శ్యామల, దివ్యతో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
దేవరుప్పుల : సమస్యలను సాధించుకునేందుకు కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కందుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కేజీబీవీ ఉద్యోగుల తో ఏర్పాటుచేసిన సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు మడిదే రాముతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 475 కస్తూర్భాగాంధీ బాలికల పాఠశా లలను ఏర్పాటు చేయడంతో 12 వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి మరోమారు పోరాటం చేయాలని పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి డి. గోవర్ధన్ రెడ్డి, కేజీబీవీ ఉద్యోగులు వనజ, మంజుల, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : సుప్రీంకోర్టు అనుగుణంగా కేజీబీవీ, యు ఆర్ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీస వేతనం చెల్లించాలని యుటీఎఫ్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు మురళీకష్ణ డిమాండ్ చేశారు. స్థానిక కస్తూరిభా గాంధీ విద్యాలయంలో ఎస్ఓ సుమలత అధ్యక్షతన భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. మండల అధ్యక్షుడు జాడపోడ్ ప్రతాప్, సుమలత, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
డోర్నకల్ : కేజిబివి ,యూఆర్ఎస్ ఉపాధ్యాయ,ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ డోర్నకల్ శాఖ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీ ఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నామ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం మండల కార్యదర్శి కాసు మారేడ్డి అధ్యక్షతన నిర్వహించినసమావేశంలో ఆయన మాట్లాడారు. యుటీిఎఫ్ మండల అధ్యక్షులు సోమ బోయిన శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మా రెడ్డి, దేవేందర్, యు వెంకట్ రావు పాల్గొన్నారు.
బచ్చన్నపేట : కస్తూర్బాగాంధీ,యుఆర్ఎస్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారమ వుతాయని యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు పి.చంద్రశేఖర్రావ్ అన్నారు. బుధవారం మండలంలోని కస్తూర్భాగాంధీ పాఠశాల ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి మడూరి వెంకటేశ్, మండల అధ్యక్షులు కార్యదర్శులు క్రిష్ణమూర్తి, కనుకయ్య, ఉపాధ్యాక్షులు శ్రీధర్, సీఆర్టీలు సుమలత, శిరీష, రాజమణి, మనోరమ పాల్గొన్నారు.