Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ తాగి ఒకరు మృతి... ఇద్దరి పరిస్థితి విషమం
నవతెలంగాణ-బచ్చన్నపేట
చాపత్త అనుకుని వరి మందు కలిపిన టీ తాగి ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారిన ఘటన మండలం లోని రామ చంద్రాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామచంద్ర పురం గ్రామానికి చెందిన దాసారం అంజమ్మ(60) భర్త మల్లయ్య, మరిది భిక్షపతికి రోజు ఉదయం టీ అందించేవారు. ఈ క్రమంలో చాయపత్తా అనుకొని వరి మందును కలిపింది. ఇది తాగిన వారి పరిస్థితి విషమించింది. గమనించిన స్థానికులు వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అంజమ్మ మృతి చెందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో ఇద్దరిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతురాలి కుమారుడు చంద్ర మౌళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.