Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
డివిజన్ కేంద్రంలోని గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. పనులను గురువారం ఆయన పర్యవేక్షించారు. రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతున్న క్రమంలో స్వయంగా ఏరోజుకారోజూ పనులపై ఆరా తీస్తున్నారు. విస్తరణ పనుల్లో అడ్డుపడుతున్న ప్రజలతో మాట్లాడి వివరించారు. నెలరోజుల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేష్, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, దయాకర్, రాజు, మండల అధ్యక్షులు గట్టు రమేష్, కృష్ణారెడ్డి, మల్లేష్, ప్రసాద్, వేణు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.