Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నయీంనగర్
అణగారిన వర్గాల అభ్యున్నతికి కషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి ఎండీ రహీం అన్నారు. జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా హనుమకొండ భవానీనగర్లోని పార్టీ కార్యాల యంలో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎండీ. రహీం అధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ లో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న పార్లమెంటేరియన్ బాబు జగ్జీవన్ రామ్ అని కొని యాడారు. జీవితమంతా దళితుల కోసం ప్రజల కోసం పోరాడారని ఎన్నికలలో ఏ ఒక్కసారి కూడా ఓడపొలేదని ఆయన సేవలు మరువ లేని వని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి హన్మకొండ సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శులు భైరపాక ప్రభాకర్, బాబా ఖాదర్ అలీ, పార్లమెంట్ నాయకులు చాడా మరియ, కుసు మ శ్యామ్ సుందర్, ఈశ్వరాచారి, చీలువెరు మహేష్, యాకుబ్, మాఢగాని మనోహర్, దావాసుధాకర్ తదితరులు పాల్గొన్నారు.