Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం, గాలి వానకు కోతకు వచ్చిన వరి పంట గింజలు రాలి పంట నేలవాలింది. దీంతో రైతులు ఆగమాగం అయ్యారు. పలు ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరి పోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాలు తెల్లవార్లు చీకట్లోనే గడిపాయి. బుధవారం ఉదయం వ్యవసాయ శాఖ అధికారులు మండలంలోని అమృతం, కాకర్లపల్లి, లక్ష్మీపురం, మొద్దులగూడెం గ్రామాల్లో నేల వాలి గింజలు రాలిన వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. మరో రెండు రోజులపాటు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో పంట నష్టాన్ని పరిశీలించనున్నట్టు వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ గాలి దుమారం, వర్షాలు మరో రెండు రోజులపాటు ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారుల ప్రకట నలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. చేతికంది వచ్చిన వరి పంట ఎక్కడ నేలపాలవుతుందన్న భయం రైతులను వెంటాడుతోంది. పంట నష్టపో యిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.