Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండల కేంద్రంలోని సీహెచ్సీలో 124, ముల్కనూరు పీహెచ్సీలో 132 మందికి శనివారం మొదటి, రెండో దశలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధి కారులు రాణాప్రతాప్, ప్రణవిలు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి 45 సంవత్సరాలు దాటినా వారు ఆధిక సంఖ్యలో రావ డంతో వైద్య అధికారులు సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ను జిల్లా పంచాయతీ అధికారి రఘు వరన్, ఎంపీడీఓ రవీంద్రరావు, సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ పరిశీలించారు. కాగా వ్యాక్సిన్ పట్ల భయాందోళనల నేపథ్యంలో అన్ని పంచాయతీల సర్పంచ్లు, అరోగ్య సిబ్బంది, కార్యదర్శి, రెవెన్యూ ఉద్యోగులు ప్రజలను ఆటోలు, ట్రాక్టర్లలో ఆస్పత్రులకు తరలించారు.