Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
మాస్క్ లేకుండా వాహనాలపై ప్రయాణం చేస్తే భారి జరిమానా విధి స్తామని వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ వాహనదారులను హెచ్చరించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబం ధనలు బేఖా తరు చేస్తూ వాహనాలు నడిపిన పలువురికి మంగళవారం ట్రాఫిక్ పోలీ సులు భారీ జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల పట్ల వాహనదారులు అశ్రద్ద వహించొద్దని వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున వాహనదారులు తప్పనిసరిగా మాస్కు ధరించి కోవిడ్ నిబం ధనలకు లోబడి ప్రయాణాలు చేయాలని తెలిపారు. నిబంధనలను ఉల్లం ఘిం చిన వారికి భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికోసం ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నట్టు తెలిపారు.