Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజిపేట
త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని పార్టీలు గౌడ్లకు సముచిత స్థానం కల్పించాలని గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఫాతిమా నగర్లోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో గౌడ సంక్షేమ సంఘం వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాల్లపెళ్లి రమేష్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ త్వరలో జరగబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ జనాభాలో 12 శాతం అంటే దాదాపు 80 వేల పైన ఓట్లు ఉన్న గౌడ కులస్తులకు 8 నుంచి 10 టికెట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలను కోరారు. ఈ కార్యక్ర మంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపతి గోపి గౌడ్, రాష్ట్ర నాయకులు కోతి సాంబరాజ్ గౌడ్, తాల్లపెళ్లి కుమారస్వామి గౌడ్, యువజన విభాగం అధ్యక్షులు పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ముంజ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.