Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల్ల
నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడిన వారు జనం గుండెల్లో అజరామరంగా నిలిచి పోతారని న్యూ డెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని మద్దివంచ గ్రామంలో అనారోగ్యంతో మతిచెందిన ఎన్డీ సీనియర్ నాయకులు మార్తి బిక్షం స్దూపం ఆవిష్కరణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బిక్షం పీడిత తాడిత ప్రజల అభ్యున్నతికి కషి చేశారని, ఎన్ డి పార్టీ విస్తీర్ణకు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని పార్టీని నిలబెట్టారని అన్నారు. బిక్షం ఆశయసాధనకొరకు ఎన్ డి నాయకులు, కార్యకర్తలు కషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామంలో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పీటీసీ గౌని ఐలయ్య, సర్పంచ్ కుసిని బాబురావు,జిల్లా, మండల నాయకులు సీతారామయ్య,మురళి కష్ణ, పద్మ,మదర్,జి.భద్రయ్య,ఐలమ్మ, రవి తదితరులు ఉన్నారు.