Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-తొర్రూరు
కరోనా బాధితులెవరూ ఆందోళన చెందొద్దని, మీ అందరికీ అండగా నేనున్నానని, కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధి తులతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన మాట్లాడారు. అన్ని రకాల వైద్య సదుపాయాలతోపాటు, అంబులెన్స్, ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామన్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూడా అందించాలని అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఆదేశించినట్టు తెలిపారు. ఏమైనా సమస్యలుంటే తనను గానీ, తన సిబ్బందిని గానీ, సంప్రదించొచ్చన్నారు. నియోజకవర్గంలోని పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల కరోనా బాధితులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీసులు వివిధ శాఖల అధికారులు, తదితరులతో మంత్రి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తొందరగా వ్యాపిస్తుంది. కరోనా విస్తతి చాలా ఎక్కువగా వుంది. తీవ్రత చాలా తక్కువగా ఉంది. ధైర్యంగా ఉందాం.జాగ్రత్తలు తీసుకుందాం. కరోనా బారి నుంచి కాపాడుకుందామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఒక్కో పేషంట్ , వారి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు తెలుసుకుంటూనే, ఎక్కడీ ఎలా ఉంటున్నారని ఆరా తీశారు. అలాగే, వారికి అండగా ఉండాలని స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి చెప్పారు. అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సకు సంబంధించిన ఆదేశాలను సంబంధిత జిల్లా వైద్యాధికారి, వైద్యులకు ఇచ్చారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి మరోసారి గుర్తు చేశారు. పోలీసు అధికారులు కూడా కరోనా బాధితుల హౌం క్వారంటైన్, తగు సదుపాయాలు, మిగతా సమాజం తీసుకోవాల్సిన సామాజిక దూరం, స్వీయ నియంత్రణలు కఠీనంగా పాటించేలా చూడాలన్నారు. అలాగే, అందరూ మాస్కులు ధరించాలన్నారు. కరోనా పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, వైద్యులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.