Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 డివిజన్లలోనూ ఇంటింటికీ శ్రేణులు..
నవతెలంగాణ-వరంగల్
గ్రేటర్ వరంగల్ ఎన్ని కల నేపథ్యంలో సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారం శుక్రవారం జోరందుకుంది. బల్దియా పరిధిలోని 1, 4, 29, 31, 36, 37, 40, 42, 57 డివిజన్లలో రజిత, గాదె రమేష్, అరూరి కోమల, మంద సంపత్, నాగపురి సునీత, నలిగంటి రత్నమాల, సామల శ్రీధర్, ముత్యం ప్రత్యూష, దీప ఆయా డివిజన్ల పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. తమను గెలిపిస్తే ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి, ఇతర సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కమ్యూనిస్టులతోనే ప్రజాసమస్యలు పరిష్కారమౌతాయని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం, హక్కుల సాధన దిశగా పోరాడుతున్న తమను గెలిపించాలని ప్రజలను కోరారు.