Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మహదేవపూర్ ఉమ్మడి మండలం నీలంపల్లి గ్రామంలో బుధవారం మహాదేవపూర్ సీఐ కిరణ్, పలిమెల ఎస్సై శ్యామ్ రాజు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటి సోదాలు నిర్వహించారు. అనంతరం గ్రామ కూడళ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ కిరణ్ మాట్లాడుతూ అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించొద్దన్నారు. తెలంగాణ బార్డర్ కావడంతో మావోయిస్టులు తెలంగాణ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నదని, వారికి ఆశ్రయం కల్పించడానికి యత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరుణ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాస్క్ ధరించాలని సూచించారు. ఏదైనా అవసరముంటే పోలీసులకు తెలపాలని, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇచ్చంపల్లి ప్రాజెక్టును సందర్శించి మహారాష్ట్ర చత్తీస్గఢ్ సరిహద్దు గుట్టలను పరిశీలించారు.