Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-ఖిలా వరంగల్
విధుల పట్ల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా పరిధి 41వ డివిజన్ శంభునిపేట గవిచర్ల క్రాస్ రోడ్, చైతన్యనగర్, ఉర్సు, కరీమాబాద్, షానూర్ పుర ప్రాంతాల్లో మేయర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా సానిటేషన్ స్థితి గతులను పరిశీలించారు. అనంతరం గవిచర్ల క్రాస్ రోడ్ వద్ద పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సానిటేషన్ను పకడ్బందిగా చేపట్టాల్సిన అవసరం ఉందని, ఉదయం 11 గం.ల తర్వాత గ్యాంగ్ వర్క్స్ నిర్వహించాలని ఎస్ఐని ఆదేశించారు. స్విపింగ్ మిషన్స్తో శుభ్రం చేయించే క్రమంలో స్థానిక కార్పొరేటర్స్కు సమాచారం ఇవ్వాలన్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉర్సు షానూర్ పుర, హరి మిల్క్ పాయింట్ సమీపంలో రోడ్డు పైన మురికినీరు ప్రహహిస్తుండడం తో అక్కడ కల్వర్టు నిర్మాణం చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి, ఎదుల భిక్షపతి, ఎస్ఐలు సునీల్, నాగభూషణం, జవాన్ అనిల్ స్థానికులు రమేష్, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రతాప రుద్ర ఫిల్టర్ బెడ్ తనిఖీ
పోచమ్మ మైదాన్: దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫిల్టర్ బెడ్ను సందర్శించిన అనంతరం మేయర్ నీటి సరఫరా జరిగే తీరును డీఈని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫిల్టర్స్ మీడియన్స్ను మార్చడం వల్ల నీటి నాణ్యత పెరిగిందని,నీటిని క్లోరిన్ పరీక్ష నిర్వహించే క్రమంలో 2 పీపీఎం.ఉండేలా చూడాలని చివరి ప్రాంతం వరకు నీరు చేరేక్రమంలో 2 పీపీఎం.ఉండేలా చూడాలని, ఎక్కడైతే మిషన్ భగీరథ ఫైపులలో గ్యాప్ లు ఉన్నట్లయితే వాటిని వెంటనే పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ ఈ.ఈ. రాజకుమార్ను చరవాణి ద్వారా ఆదేశించారు. డీఈ. సంజరు, ఏఈ కార్తీక్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్లు విక్రమ్, సుమంత్, ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.