Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-సంగెం
పోలీసులు నిబద్దతతో విధులు నిర్వహిస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి పిలుపునిచ్చారు. గురువారం సంగెం పోలిస్ స్టేషన్ను ఆయన సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ సన్నిహిత కౌంటర్, స్టేషన్ ఐటీ కోర్ విభాగం పనితీరుపె ఆరా తీసారు. పోలిస్ స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతోపాటు నమోదైన కేసులను పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను ఎస్సై సురేష్ను అడిగి తెలుసుకున్నారు. శాఖపరమైన సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, మామూనూర్ ఏసీపీ నరేష్ కుమార్, పర్వతగిరి సీఐ కిషన్, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.