Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్
- గ్రామ పంచాయతీల్లో దోమతెరలు పంపిణీ
నవతెలంగాణ-బయ్యారం
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్రాజ్ కోరారు. మండలంలోని గంధంపల్లి పీహెచ్సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం గంధంపల్లి, సింగారం గ్రామ పంచాయతీల్లో ప్రజలకు దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రజలు పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న దోమ తెరలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తాతా గణేష్, సింగారం సర్పంచ్ బానోత్ కోటి, ఎంపీడీఓ చలపతిరావు, వైద్య అధికారి రాజేంద్రప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు బానోతు శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.