Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కలు నాటి సంరక్షించాలి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-పర్వతగిరి
పల్లెప్రగతిలో భాగంగా పచ్చదనం పెంచాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. హరితహారం కింద నాటిన మొక్కలు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రహదారుల వెంట మొక్కలు నాటి వాటికి ప్లాస్టిక్ గార్డులను ఏర్పాటు చేయకపోవడం వల్ల పశువులు వల్ల దెబ్బతింటున్నాయని తెలిపారు. వాటికి ముళ్ల కంచెతో రక్షణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కూలీలకు ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పచ్చదనం పెంపునకు విరివిగా మొక్కలు నాటాలన్నారు. గ్రామ ప్రవేశం నుంచి రహదారికి ఇరువైపులా పచ్చదనంతో గ్రామాలకు క్రొత్త శోభ తేవాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేయాలని కోరారు. వన సేవకులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశిచంఆరు. నాటిన మొక్కలు వంద శాతం మనుగడ పొందేలా, కార్యాచరణ చేయాలన్నారు. మొక్కలకు షెడ్యూల్ ప్రకారం వాటరింగ్ కచ్చితంగా చేపట్టాలని అన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రజలు ఆహ్లాదకరంగా కొంత సమయం గడపడానికి, మంచి గాలికి మొక్కలు, శారీరక ధఢత్వానికి ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ లతో రాష్ట్రంలోని ప్రతి ఆవాసంలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు. 19 వేల 470 అవాసాల్లో రూ. 115 కోట్ల 10 లక్షల ఖర్చుతో పల్లె ప్రకతి వనాల ఏర్పాటుకుగాను ఇప్పటివరకు 18 వేల 68 అవాసాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. పల్లెల సమగ్ర అభివద్ధి, ప్రజల వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.