Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జిల్లావ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ-జనగామ
పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి మోకు కనకారెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సాయన్న డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను ఇష్టారీతిన పెంచడాన్ని నిర సిస్తూ ఈనెల 19న నిరసనలు తెలుపనున్నట్టు వారు చెప్పారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బొట్ల శేఖర్ అధ్యక్షతన శుక్ర వారం నిర్వహించిన వామపక్ష పార్టీల సమావేశంలో కనకారెడ్డి, ఆది సాయన్న మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి 30 వరకు పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను భారీగా పెంచిందని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ఈనెల 19న తలపెట్టిన జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, సీపీఐ జిల్లా నాయకులు ఒండ్రు వైకుంఠం, చొప్పరి సోమయ్య, సీపీఐ(ఎం) పట్టణ నాయకులు జోగు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.