Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి
నవతెలంగాణ-కాశిబుగ్గ
దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని కాశిబుగ్గ లోని పెట్రోల్ పంపు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జ్యోతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆరు వారాల్లో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను 24 సార్లు పెంచారని మండిపడ్డారు. కరోనా సంక్షోభంలో కూడా పెట్రోల్ ధరలను పెంచడం దారుణమన్నారు. దేశంలో చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచుతుందని దాని ప్రభావం వినియోగదారుల మీద పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ విధించడం వలన అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఇకనైనా పెట్రోల్ డీజిల్ ధరలను నిత్యావసర కూరగాయల ధరలను వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు తాళ్లపల్లి రహేలా, ప్రజానాట్య మండలి జిల్లా నాయకుడు దామెర కష్ణ, దివ్య, మున్ని, రాణి తదితరులు పాల్గొన్నారు.