Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి
- జేసీబీ, రెండు ట్రాక్టర్లు సీజ్
నవతెలంగాణ ఎఫెక్ట్
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
చెరువుల్లో నుంచి రేగడి మట్టిని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి తెలిపారు. 'నవతెలంగాణ' కథనానికి స్పందన వచ్చింది. తొర్రూరు మండలంలోని ఫత్తేపురం గ్రామంలో అక్రమంగా మంగళవారం రాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీని, రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. గ్రామం నుంచి అనుమతులు లేకుండా చెరువులోని రేగడి మట్టిని తరలిస్తున్న సమాచారం రావడంతో సీజ్ చేశామన్నారు.