Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టులకు వైద్యసాయం అందించడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ కోటిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషన్ కొంత కాలంగా కరోనాతో బాధపడుతూ ఈనెల 21న ఉదయం గుండెనొప్పితో మృతి చెఉందినట్టు తెలిసిందని పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ నేతలు కూకటి వెంకన్న, శారద, సోను, వినోద్, నందు, ఇడుమ, దేవె, మూల దేవేందర్రెడ్డి, దామోదర్, భద్రు కరోనాతో బాధపడుతున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. వైద్యం అందకనే మావోయిస్ట్ నేతలు గడ్డం మధుకర్, ఏసోబ్రాయి, నందు, హరిభూషన్ మరణించినట్టు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోతే వైద్యం అందిస్తామని, ప్రభుత్వ సాయం అందేలా చొరవ తీసుకుంటామని తెలిపారు.