Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు
- ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ-పాలకుర్తి
ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు సూచించారు. మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. నాసిరకంగా నిర్మించొద్దని సూచించారు. ఆలయ మహా మండప నిర్మాణ పనుల వివరాల గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీరస్వామి, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి రామన్న, లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, అనిల్ కుమార్. మత్తగజం నాగరాజు, అయ్యదేవర నాగరాజ్ శర్మ, సిబ్బంది అశోక్, శ్రీనివాస్, రాములు, తదితరులు పాల్గొన్నారు.