Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14వ ఆర్ధిక సంఘం నిధులు దుర్వినియోగం
- సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి సమ్మెట రాజమౌళి
- అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్కు ఫిర్యాదు
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ మున్సిపాల్టీలో హరితహారం, పల్లె ప్రకృతి వనాల్లో పల్లె వలలో అవినీతి అక్రమాలు జరిగాయని, 14వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం అయ్యాయని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి సమ్మెట రాజమౌళి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్కు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ బానోత్ సీతారాంతో కలిసి రాజమౌళి మాట్లాడారు. డంపింగ్ యార్డుల, సైడ్ డ్రెయినేజీలు, తదితర పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. విచారణ జరిపించి అవినీతికి పాల్పడ్డ అధికారులు, కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు పాలవెన్నెల మల్లయ్య, రావుల రాజు, హేమానాయక్, బానోత్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.