Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
రేషన్డీలర్లకు ప్రభుత్వం గౌరవవేతనం చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ధారవత్ మోహన్ కోరారు. మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. డీలర్ల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగర వాణిరామరాజు, కోశాధికారి చెట్టుపెల్లి దామోదర్, ముఖ్య సలహాదారు జీ.ఉపేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతరాజు రమేష్, వివిధ మండలాల అధ్యక్షులు గడ్డం బాబు, వెంకటనారాయణ, బాబురెడ్డి, శంకర్రావు, మధుకర్ రెడ్డి, సర్వేశం, జిల్లా కమిటీ సభ్యులు కుమారస్వామి, సామనాయక్ తదితరులు పాల్గొన్నారు.