Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-ఐనవోలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని, ప్రజలు వారికీ చరమగీతం పాడాలని సీపీఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని ముల్కలగూడెంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాడని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజా సమస్యల ప రిష్కారం కోసం సీపీఐ(ఎం) ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు ప్రజలకు అండగా పోరాటాలు నిర్వహించాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్రెడ్డి, మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య, ముల్కలగూడెం కార్యదర్శి గుండెకారి మహేందర్, సహాయ కార్యదర్శి జక్కుల గోపి, స్థానిక సర్పంచ్ బండి పర్వతాలు, మండల కమిటీ సభ్యులు నారాయణ రెడ్డి, బాబూరావు, చంద్రయ్య గోపాల్, రాజు,రాజేశ్వరరావు, సంపత్, ఝాన్సీ కమలమ్మ, విజయ తదితరులు పాల్గొన్నారు