Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న, నూతనంగా మంజూరైన జాతీయ రహదారి పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని మహబూబాబాద్ ఎంపీ కవిత కోరారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ఎంపీ కవిత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ములుగు నుంచి మహబూబాబాద్ వరకు నిర్వహిస్తున్న 365 జాతీయ రహదారి పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. వలిగొండ నుంచి వయా తొర్రూరు మహబూబాబాద్ మీదుగా భద్రాచలం వరకు మంజూరైన జాతీయ రహదారి పనులు ప్రారంభించలేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే వేగవంతం చేయాలని కోరారు